Pages

5, డిసెంబర్ 2011, సోమవారం

" కట్ట మంచి రామలింగా రెడ్డి "

డాక్టర్ .సి.ఆర్ . రెడ్డిగా ప్రసిద్ధి చెందిన " కట్టమంచి రామ లింగా రెడ్డి గారూ " ప్రతిభా వంతుడైన , మంచి సాహితీ వేత్త. అంతే కాదు, పెద్ద పండితుడు , విద్యా వేత్త , హాస్య రచయిత , వక్త , రచయిత , హేతు వాది , ఆదర్శ వేత్త , రాజ నీతిజ్ఞుడు , ఇలా బహు ముఖ ప్రజ్ఞాశాలి . అయితే , ఇంతటి ప్రతిభా వంతుడైన రెడ్డి గారు ," ఆంధ్ర భాషా రంజని " సంఘంలో , చురు కైన పాత్రను కుడా పోషించారు. అంతే కాదు ," గైక్వాడ్ స్పూర్తితో " అమెరికాలో విద్యా భ్యాసం చేసారు.
ఈయన చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో ౧౮౮౦ {1880 ] డిసంబరు ౧౦ [ 10 ] న జన్మిం చారు. నారాయణమ్మ ,సుబ్రమణ్య రెడ్డి , దంపతులకు యితడు మూడవ సంతానం. అయితే , సుబ్రహ్మణ్య రెడ్డి సోదరు డైన , పెద రామస్వామి రెడ్డి గారు , మన రామలింగా రెడ్డి గారిని , దత్త పుత్రుడు గా స్వీకరించారు.
ఇక , వీరి విద్యా భ్యాసం , తన ఐదవ ఏటనే వీధి బడి చదవుతో ప్రారంభ మైంది. ఈయన తన చిన్న వయసులోనే ,భారతాన్ని , అమర బాల రామాయణాన్ని ,చదివే వారట . వీరు ౧౮౯౦ [ 1890 ] లొ ప్రస్తుత పేరుతొ ఉన్న " సి .ఆర్ . రెడ్డి . " పేరుతొ ఉన్న చిత్తూరు బోర్డ్ " హై స్కూల్ లొ , మొదటి ఫారంలో జేరి , ప్రతి పరీకః లోను ఉన్నత శ్రేణిలో గెలుపు సాదిం చారు. పిమ్మట ,ఉన్నతా భ్యాసం కోసం , మదరాసు క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసారు. ఇక తన ౧౯ [19 ] వ ఏటనే , " ముసలమ్మ మరణం " అనే కావ్యాన్ని రచించి , బహుమతి పొందడం జరిగింది. ఇది ౧౮౯౯ [ 1899 ] లొ " నవ్య కావ్య " రచన పోటీలో గెలు పొందినది . అంతే కాదు
వీరు , ౧౯౦౨ [ 1902 ] లొ డిగ్రీ పరీక్షలో " తత్వ శాస్త్రం లొ " అత్యధిక మార్కులతో , ఉత్తమ శ్రేణిలో గెలుపొంది , బంగారు పతాకాన్ని పొందారు. అలాగే , మంచి వక్తగా , ఆంగ్ల తెలుగు భాషలలో , మరెన్నో బహుమతులు గెలుచు కోవడం జరిగింది. డిగ్రీలో మంచి మార్కులు రావడం వల్ల , ప్రభుత్వం వారు , స్కాలర్ షిప్ తొ ఇంగ్లండు లోని " కేంబ్రిడ్జి " విశ్వ విద్యాలయానికి పంపించారు. అక్కడ పలు బహుమతులను అందు కొన్నారు. వారి ప్రతిభా పాటవమునకు గుర్తింపుగా , ౧౯౦౩ [ 1903 ] లొ " రైట్ " బహుమతి లభించింది . పిమ్మట " విద్వాంసుడు " పురస్కారాన్ని అందుకున్నారు. తదుపరి విశ్వ విద్యాలయంలో , " యునియన్ లిబరల్ క్లబ్ " కార్య దర్శి గా ఎన్నికై అక్కడ అనేక ఉపన్యాసాలలో , ఆంగ్లేయుల మన్ననలు , ప్రసంసలు , పొందారు . ఒక భారతీయుడిగా ఇటువంటి గౌరవం దక్కడం , అదే ప్రధమం . పిమ్మట వారు ఎం.ఏ. పరీక్షలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు.
వారికి విద్యా శాఖలో ఉద్యోగం ఇవ్వదలచి , ఆ సంస్థాన దీసుడైన " సయాజీ రావ్ గైక్వాడ్ " రెడ్డి గారి ప్రతిభను గుర్తించి ,అందుకు గాను మరిన్ని విశ్వ విద్యాలయాలు సదర్సించ డానికి అమెరికాకు పంపించాడు. పర్యటన పూర్తి జేసి , ౧౯౦౮ [ 1908 ] లొ స్వదేశానికి వచ్చి తన ౨౮ [ 28 ] వ ఏట బరోడా కళాశాలలో ఆచార్యునిగా , తోలి ఉపాధ్యాయుని గా ప్రారంభించి , విద్యా వ్యవస్థను , మరింత మరింత అధ్యయనం చేయడానికి అమెరికా , ఫిలిప్పైన్స్ , జపాన్ దేశాలు పర్య టించారు . వీరి సాహితీ సేవ అనన్యం.
వీరు రచించిన " ముసలమ్మ మరణం " ౧౯౦౦ లొ తోలి ముద్రణకు నోచు కుంది . అంతే కాదు " భారత అర్ధ శాస్త్రం , కవిత్వ తత్వ విచారం , ఆంధ్ర సర్వ కళాశాల విద్యా ప్రవృత్తి , లఘు పీఠికా సముచ్చయం , వ్యాస మంజరి , పంచమి , వేమన , మున్నగు నవి వీరి తెలుగు రచనలు. సాహిత్యంలో సరి కొత్త భావాలకు , మనో వికాసాత్మక మైన విమర్శలు , సంభాషణలతో , దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు , వాదనా చాతుర్యం , హాస్య ప్రియత్వం , ఛలోక్తులు , సంభాషణా నైపుణ్యంతో , ఆకట్టు కొ గలిగిన దిట్ట. ఆంగ్ల రచనల్లో చేయి తిరిగిన వ్యక్తి. ఆంగ్లం లొ మచ్చుకి " డ్రామా ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ " , స్పీచస్ ఆన్ యునివర్సిటీ రిఫార్మ్" , డెమోక్రసీ ఇన్ కాన్ టెంపరరీ ఇండియా " మున్నగు నవి. కొన్ని మచ్చు తునకలు మాత్రమే.
అంతే గాక " ఆంధ్ర భాషాభి రంజని " వారి పోటీలో బహుమతి గెలుచు కుంది.
ఇక రెడ్డిగారి ఛలోక్తులు , హాస్య చతురత , సమయ స్పూర్తి , శ్లాఘ నీయం.
" ఒకసారి ఆయన తన [ అన్నగారి ] అల్లుని ఇంటికి వెళ్ళి నప్పుడు , ఇంటి ముందు కారు దిగి అక్కడ " కుక్కలున్నాయి జాగ్రత్త " అన్న బోర్డ్ చూసి " ఇక్కడ ఇంతకు ముందు మనుషులుం డేవారు కదా ? " అని చమత్కరిం చారట.
" ఇంకొకసారి ఆయన పరసం గిస్తుండగా కరెంటు పోయిందట . అప్పుడు " చీకట్లో మాట్లాడటం నాకు అలవాటు లేదు . బ్రహ్మ ఛారిని కదా ! " అని ఛలోక్తి విసిరారట.
" మనం పేద వాళ్ళం కావచ్చు , కానీ బిచ్చ గాళ్ళం కానక్కర లేదు. "
" ఈ నాటి యువత , " సలహాలు తీసు కోవడం కంటె ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు " అంటూ ఇలా ఎన్నో , ఎన్నెన్నో .
ఇక వీరి పదవులు . ౧౯౨౬ [ 1926 ] లొ " డాక్టర్ . సి . ఆర్ . రెడ్డి . ఆంధ్ర విశ్వవిద్యాలయానికి , తొలి ఉపాధ్యక్షుని గా నియమితు లయ్యారు. పిమ్మట , ప్రభుత్వ దమన నీతికి నిరసనగా , ౧౯౩౦ లొ రాజీ నామా చేసారు. తదుపరి మళ్ళీ వారికి ౧౯౩౬ లొ ఆ పదవిని అప్పగించింది .
వీరు తెలుగుని " ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని నిర్వచించారు.
వీరు ఆజన్మాంతం బ్రహ్మ చారిగానే మిగిలి పోయారు. ౧౯౫౧ ఫిబ్రవరి ౨౪. న తుది శ్వాస విడిచారు. వీరి విగ్రహాలు పలు చోట్ల ఉన్నాయి. ప్రస్తుతం ఏలూరులో సి. ఆర్. రెడ్డి .పేరున ఉన్న కళాశాల వీరి పేరున ఉన్నదే

4 కామెంట్‌లు:

Rao S Lakkaraju చెప్పారు...

" ఒకసారి ఆయన తన అల్లుని ఇంటికి వెళ్ళి నప్పుడు" ఎవ్వరీ అల్లుడు ఆయన బ్రహ్మచారి కదా!
,
డాక్టర్ . సి . ఆర్ . రెడ్డి గారి గురించి ఎప్పటి నుండో తెలుసు కోవాలనుకున్నది తెలుసు కున్నాను. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజమే నాకు తట్టలేదు . మంచి ప్రశ్న వేసారు. . చదివింది చదివి నట్టు రాసాను. బహుశా " మేనల్లుడేమో " " సి.ఆర్. రెడ్డి కాలేజి ఏలూరులో ఉంది. అది కుడా వ్రాయడం మర్చి పోయాను

జ్యోతిర్మయి చెప్పారు...

రాజేశ్వరి గారూ..పుట్టునరోజు సుభాకాంక్షలండీ...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు .జ్యోతిర్మయి గారు . అవునూ ! " ప్రణీత స్వాతి " అని వస్తుంది .రెండు మీరేనా ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase