Pages

24, ఆగస్టు 2010, మంగళవారం

మేడి చెట్టు.

మేడిపండు చూడ మేలిమైయుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు... అని వేమన గారి పద్యం చదువుకున్నాం కదా! మరి ఆ మేడి పండులో పురుగులుంటాయే గాని ఆ చెట్టుకి ఎంతటి మహత్యం ఉందో తెలుసుకుందామా? పూర్వం ప్రహల్లాదుడి తండ్రి "హిరణ్యకశిపుడు" అనే రాక్షరాజు తనకొడుకు ప్రహల్లాదుడిని తనకి శతృవైన హరి భక్తుడని ఎన్నో బాధలు పెట్టాడు. నీ హరి ఎక్కడున్నాడు ఈ స్థంభంలో ఉన్నాడా చూపించు అని ప్రహల్లాదుణ్ణి హింసించినప్పుడు "తండ్రీ ఇందు గలడందులేడని సందేహము లేదు విశ్వమంతట ఉన్నాడు" అని చెప్పి భగవంతుడిని ప్రార్ధించగా, స్థంభం పగులగొట్టగా నరసింహావతారంలో శ్రీహరి ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి తన బలమైన గోళ్ళతో చీల్చి చంపుతాడు. అలా చంపటంవల్ల దుర్మ్మార్గుడైన రాక్షసుడి రక్తం విష్ణువు చేతులకంటుకుని మంటలు పుట్టాయట. అప్పుడు లక్ష్మీదేవి మేడిచెట్టు ఆకులతోను ఆ పండ్లతోను శీహరి చేతులు తుడిచి ఆ మంటల బారినుండి ఉపశమనం కలిగించిదట. అందుకు సంతసించిన విష్ణువు "నిన్ను భక్తితో సేవించినవారికి విష బాధలు తొలగి పాపాలు నశించి అభీస్టాలు నెరవేరుగాక" అని గొప్ప వరమిచ్చాడట. అంతేగాక నీ చెట్టు నీడన చేసిన జపతపాదులకు యజ్ఞయాగాదులకు అపారమైన ఫలితముండుగాక అని ఆశీర్వదించి మేము ఎల్లవేళల నీయందే నివశించిఉంటాము అని ఎన్నో వరాలని ప్రసాదించాడు. దీనినే "ఉదుంబర వృక్షము" అని కూడా అంటారు. చూసారా బాలలూ పండులో పురుగులుంటేనేమి చెట్టుకి ఎంతటి పవిత్రత ఉందో? అంచేత ఎవరి అదృష్టం వారిదే ఎవరి పేరు ప్రఖ్యాతులు వారివే. పురుగులున్నంత మాత్రాన దోష గుణం లేదు, భగవంతుడి విష బాధని తొలగించింది కదా? తల్లి చెట్టుతోపాటు తనకీ పుణ్యం అబ్బింది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase